Anasuya : జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాక అనసూయ పై అనేక రూమర్స్ వచ్చాయి. అసలే ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి మళ్లీ వచ్చింది. ఇక ఇప్పుడు శాశ్వతంగా బయటికి వెళ్లినట్టుంది. అయితే అలా మల్లెమాలకు దూరంగా, జబర్దస్త్ షోను వదలడంపై సరైన కారణాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు కానీ తాజాగా ఈ విషయాలపై అనసూయ స్పందించింది. జబర్దస్త్ షో నుంచి ఎప్పటినుంచో బయటికి రావాలని అనుకుంటున్నాను. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నాకు మంచి అవకాశాల ఇచ్చింది. అక్కడ మంచి వ్యక్తులు ఉన్నారంటూ గొప్పగా చెప్పేసింది. కానీ కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. నాకెందుకో అనిపిస్తుంది జబర్దస్త్ లో ఉన్న వాళ్ళకి దిష్టి తగిలిందేమో అని అందుకే ఇలా అయింది. అంతా కలిసి ఫ్యామిలీ లా ఉండేది అంటూ ఎమోషనల్ అయింది.
నిజానికి తాను జబర్దస్త్ చేసేది, సినిమాల్లో చేసేది తాను కాదని అంది. తను కేవలం అక్కడ పనిచేస్తున్నానంతే అంటూ తెలిపింది. తన గురించి తాను చెప్పడం కోసమే బ్రేక్ తీసుకున్నానని అంటుంది. షూటింగ్ కోసం అడ్జస్ట్మెంట్ అడిగినప్పుడు తనకే గిల్టీగా అనిపిస్తుందని చెప్పింది. తొమ్మిదేళ్లు జబర్దస్త్ యాంకర్ గా ఉన్న నాకు ఆ షో బోర్ కొట్టలేదు. నేను ఎవరిని బ్లేమ్ చేయదలచుకోలేదని చెప్పుకొచ్చింది. నాకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఇవన్నీ తప్పవని తెలిపింది. నా పై పంచ్ వేసినప్పుడు నాకు నచ్చక రియాక్షన్ ఇచ్చిన అవి పీపుల్ కి చేరేది కాదు. ఆడియన్స్ కి మాత్రం కనిపించేదే నిజం. రంగుల ప్రపంచంలో నేను అది కాదు అని చెప్పాలనుకున్న కానీ అది ఆడియన్స్ కి చేరేది కాదు.బాడీ షేమింగ్, వేకిలి చేష్టలు నాకు నచ్చదు అది నేను కాదు వాటికి నేను రియాక్షన్ ఇచ్చే ఉంటాను కానీ అది వేయరు.
Anasuya : మేం గొర్రెల మందలం కాదు అంటూ ఫైర్ అయిన అనసూయ.
నేను చాలా బాధపడ్డాను. కొంతమంది నన్ను చాలా మంచి దానివి అని అంటుంటారు. మరి కొంతమంది నాకు పొగరు అని అంటారు. అది నేనే ,ఇది నేనే ఆ విషయంలో నేను సిగ్గుపడటం లేదు అని చెప్పుకొచ్చింది అనసూయ. జబర్దస్త్ లో నాగబాబు గారు, రోజా గారు మేమంతా మొదటి నుంచి ఉన్నాం. అప్పటికి సుడీగాలి సుదీర్ వాళ్ళు కూడా లేరు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని నేను వెళ్ళిపోవడానికి నేనే గొర్రెల మంద టైప్ కాదు ఓ గొర్రెల మంద నన్ను ఎటాక్ చేయడం జరిగింది చాలా రోజుల క్రితం అంటూ ట్రోలర్ పై కౌంటర్లు వేసింది. నాకు టిఆర్పి గురించి పెద్దగా లెక్కలు తెలియవు. నేను స్టార్టింగ్ చేసినప్పుడు టిఆర్పి రేటింగ్ ఎక్కువగా వచ్చిందంట. నాకిచ్చే జీవితానికి నేను ఎంత చేయాలో అంత చేస్తానని తెలిపింది. నాకు టిఆర్పి తో సంబంధం లేదు. నేను వాటిని పట్టించుకోను అంటూ చాలా విషయాలను చెప్పుకొచ్చింది అనసూయ.