Rajamouli : ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్న అగ్ర డైరెక్టర్ రాజమౌళి. ఈ క్రేజీ డైరెక్టర్ త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ రేసులో డైరెక్టుగా నామినేట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా తరపున రాని నామినేషన్ ను వరల్డ్ వైస్ గా మూవీను పబ్లిసిటీ చేసి అందరి ఆదరణ పొందారు. దాని మూలంగా ఆస్కార్ రేస్ లో నిలబడాలని ఎంతో కృషితో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం బయటకు వస్తుంది.
ఈ టైంలో రాజమౌళి గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. రాజమౌళి తీసిన మగధీర మూవీ చూసిన టైంలో ఆయన భారత దేశంలో గొప్ప దర్శకుడుగా ఇమేజ్ పొందారు.. అగ్ర మూవీలు తీయగలిగే స్ట్రెంతు తనలో ఉందని నేను అనుకుంటున్నాను. తప్పక రాజమౌళి నుంచి అగ్ర మూవీలు వస్తాయని అనుకున్నాను..
మగధీర టైంలో తన ఊహించినట్లుగానే బాహుబలి మూవీను చేసి తను అనుకున్న ఆలోచన తప్పు కాదని తెలిసేలా చేశారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు మూవీ ఇండస్ట్రీకి తప్పకుండా చాలా ముఖ్యం అన్నట్లుగా రెహమాన్ తెలిపారు..
రాజమౌళి స్ట్రెంత్ ఏంటో బాహుబలి మూవీ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఆయన నుంచి పెద్దపెద్ద మూవీలు రాబోతున్నాయని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
రాజమౌళి మూవీతో పాటు మణిరత్నం పోనియన్ సెల్వం మూవీ పై కూడా రెహమాన్ ప్రశంసలు చల్లారు.. భారీగా అంచనాలు వేసుకున్న పోనీయన్ సెల్వన్ అంచనాలకు సరిపోయేటట్టుగా తమిళనాట అతి భారీ వసూలను కూడా చూశారు.
ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూలని తీసుకున్నారు. మణిరత్నం మూవీ సక్సెస్ పట్ల రెహమాన్ ఆసక్తికర విషయాలను తెలియజేశారు.