Guppedantha Manasu 15 August Today Episode : ఎంగేజ్ మెంట్ రింగ్ లో సాక్షి పేరుకు బదులు వసుదార పేరుతొ ఉన్న ఉంగరం. సాక్షి తో ఎంగేజ్మెంట్ ఆగుతుందా జరుగుతుందా.

Guppedantha Manasu 15 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 15-aug-2022 (529) ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. రిషీ, వసుధార ఇద్దరికీ ఒకరి ఒకరు ఎదురుపడుతూ నడుస్తూ ఉంటారు. అన్నీ గుర్తుపెట్టుకుని ఇద్దరు బాధపడుతూ ఉంటారు.వసుదార బాధపడుతూ నడుస్తూ ఉంటే తన కాలు స్లిప్ అయు తన చేతిలో ఉన్న పూలమాల రిషీ వసు మెడలో పడుతుంది.లగ్నపత్రిక వేడుక మొదలవుతుంది.వేడుక మొదలైన తర్వాత సాక్షి, దేవయాని తప్ప మిగిలిన ఇంట్లోవాళ్లందరూ బాధ పడుతూనే ఉంటారు. ఇంతలో పంతులుగారు సాక్షిని బట్టలు మార్చుకుని రమ్మని చెబుతాడు. దేవయాని, వసుదారని సాక్షి కి హెల్ప్ చేయమని చెబుతుంది. అది చూసి మహేంద్ర జగతి తొ ఏంటి జగతి ఈ ఘోరం ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. పెళ్లికూతురి అవతారంలో సాక్షి తనకు చీరకట్టే హెల్ప్ చెసెు వసుదారన మన చేయిజారిపోయింది అని మహీంద్రా అంటాడు.

Advertisement

సాక్షి రెడీ అయిన తరువాత ఈ చేరనీకు బాగుంటుందా నాకు బాగుంటుందా.నాకె బాగుంటుంది కదా అని వసుతొ అంటోంది.ఏంటి ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు అని వసుధారని సాక్షి అంటుంది. అవునులే రిషీని కోల్పోయావు కదా. గంతకు తగ్గ బొంత ఎవరైనా ఒకరు చూసుకొని పెళ్లి చేసుకో అని వసుధారిని యడిపించేలాగా మాట్లాడుతుొది సాక్షి.రిషి దేవుని ముందు దండం పెట్టుకుంటాడు నేనొకటి నమ్మాను దాన్ని ఆచరించాను నేను చేసింది తప్పా కరెక్టా మీరు చూడాలి అని చెప్పి దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు రిషి.ఇంతలో సాక్షి రెడీ అయి వస్తుంటే సాక్షి ప్లేస్లో వసుధారాని ఊహించుకుంటూ ఉంటాడు రిషి.సాక్షిని రిషి పక్కన నిలబెట్టి ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోండి అని చెబుతోంది జగతి. రిషి ని మహీంద్రా తీసుకెళ్లిన తర్వాత జరుగుతోన్న లగ్నపత్రిక వేడుక గురించి సాక్షి జగతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Guppedantha Manasu 15 August Today Episode : సాక్షి తో ఎంగేజ్మెంట్ ఆగుతుందా జరుగుతుందా.

Guppedantha Manasu 15 August Today Episode
Guppedantha Manasu 15 August Today Episode

అలా వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు సంభాషణ జరుగుతుంది. ఇంతలో పంతులుగారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే జగతి, సాక్షి అక్కడికి వెళ్తారు. రిషి పక్కన సాక్షి వచ్చి కూర్చోబోతుంటే వసుధరా వచ్చి కూర్చో అని రిషి అనగానే. ఇంట్లోవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.రిషి ఏదో పొరపాటున అన్నాడు ఆనుకొని సాక్షి పక్కన కూర్చుంటుొది.పంతులుగారు ఇంతలో ఉంగరాలు మార్చుకోమని చెప్తాడు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత లగ్నపత్రిక రాస్తానని పంతులుగారు చెప్తారు.రిషి ఉంగరాలు తీస్తాడు. పంతులుగారు రిషి ని ముందుగా అమ్మాయికి ఉంగరం తోడకామని చెప్తాడు. రిషి సాక్షికి ఉంగరం పెట్టబోతుంటే ఉంగరంమీద వి అనే అక్షరం ఉంటుంది. అది చూసి సాక్షి చెయ్యి వెనక్కి తిప్పి ఏంటి ఇది రిషి అని అడుగుతుంది. దేవయాని ఏమైంది సాక్షి అని అడిగితే, ఉంగరంమీద వి అని అక్షర ఉంది ఆంటీ అని చెప్పగానే ఇంట్లోవాళ్లందరూ షాక్ అవుతారు.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది

Advertisement