Suchendra Prasad : పవిత్ర లోకేష్ మరియు నరేష్ యొక్క వ్యవహారం రోజురోజుకు ముధురుతూ చాలా దూరమే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నరేష్ మరియు పవిత్రా లోకేష్ తామిద్దరం సహజీవనం మాత్రమే చేస్తున్నామని పెళ్లి చేసుకోలేదంటూ బహిరంగంగానే తెలపడం జరిగింది. కొద్దిరోజులుగా ఈ విషయం మీడియాలో చెక్కర్లు కొట్టడంతో పవిత్ర లోకేష్ మాజీ భర్త అయినటువంటి సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమది లవ్ మ్యారేజ్ అని చెప్పడం జరిగింది.
అయితే తాము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని అయినా రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోరని. మ్యారేజ్ విషెస్ అనేది విదేశీ సంస్కృతి అని తమ సర్టిఫికెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పాడు. అంతేకాకుండా ఆ పెళ్ళికి పెద్ద రుజువులు ఏమి అవసరం లేదు ఎన్నో ఫంక్షన్లకి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమానికి అటెండ్ అయ్యావని. ఇంకా భార్యాభర్తలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పవిత్రా లోకేష్ పాస్పోర్టు మరియు ఆధార్ కార్డు పరిశీలించినట్లయితే భర్తగా సుచేంద్ర ప్రసాద్ పేరు ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Suchendra Prasad :ఇంతకు మించిన రుజువు అవసరం లేదు
ఇంతకు ముంచిన రుజువులు ఏమీ చూపాల్సిన అవసరం లేదు ఇంకా వేరే సర్టిఫికెట్ కూడా తన దగ్గర ఏమీ లేదని వివరించారు. భారతదేశ వివాహక సంస్కృతిలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని కావున తన దగ్గర ఏ సర్టిఫికెట్ లేదని సుచేంద్రప్రసాద్ చెప్పడం జరిగింది. అయినా సర్టిఫికెట్ సంపాదించడం తనకు పెద్ద పని కాదని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం చాలా తేలికేనని ఆయన అన్నారు. ఇదే ఇలా ఉండగా పవిత్ర లోకేష్ సుచేంద్రను పెళ్లి చేసుకోలేదని చెప్పటం గమనార్హం. నరేష్ లోకేష్ విషయం కొద్దిరోజుల వైరల్ అవ్వడంతో ఈ విషయాలు బయటకు రావడం జరిగింది.