Priyamani : టాలీవుడ్ లో ప్రియమణి మొదటిగా కేఎస్ రామారావు తనయుడు హీరోగా ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత హీరో జగపతిబాబుతో పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా గడిపింది.
ప్రియమణి తెలుగులో పాటు అటు తమిళంలో కూడా సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే తన ప్రియుడు ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గిన సీనియర్ హీరోల సినిమాలలో మంచి కథ బలం ఉన్న సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరలో షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే ప్రియమణి తన కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని అనుభవాలను ఎదుర్కొందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Priyamani : ఫస్ట్ టైం నాకు ఇష్టం లేకపోయినా ఆ పని చేశా…
ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ సన్నివేశంలో తన నాభి చూపించే సీన్ ఉందని నాభి దగ్గర టాటూ చూపిస్తూ ఆ సీన్ చేయాల్సి ఉందని ప్రియమణి చెప్పుకొచ్చింది. అయితే తనకు ముందుగా ఆ సీన్ గురించి చెప్పలేదని అయినా తాను నాభి చూపించే సీన్ చేశానని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా ఇలా అందాలు చూపించాల్సి వస్తుందని ఇలాంటి ఇబ్బందులు తప్పవని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇక ప్రియమణి ఇటీవల విక్టరీ వెంకటేష్ తో నారప్ప, రానా తో విరాటపర్వం సినిమాలో నటించింది.