బాలికపై పూర్ణానందస్వామి అత్యాచారం – తేల్చిన పోలీసులు..!!

బాలికపై అత్యాచారానికి పాల్పడిన విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై కేసు నమోదైంది.మైనర్ బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు నిజమేనని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

Advertisement

పరిపూర్ణనంద స్వామి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసును దిశ పోలీసు విభాగం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ చేపట్టారు. బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేల్చిన పోలీసులు… ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.

Advertisement

విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు.ఓ బాలికను పూర్ణానందస్వామి అర్దరాత్రి నిద్రలేపి గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్లు చెప్పారు. మరో బాలికతోనూ ఇలాగె ప్రవర్తించడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో బాలికను ఇంటికి తీసుకెళ్ళారు.

విషయం బయటకు రాకుండా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. ఇక మరో బాలిక స్వామి ఆగడాలను భరించలేక ఆశ్రమం నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది.

Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ సేవలు – రెండు గంటలకు రూ.7 వేలు చార్జీ..!

Advertisement