Minister Roja Shocking Comments : చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన బామ్మర్ది టిడిపి ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసే కుట్రల గురించి చెబుతూ మీడియాతో చాలాసేపు సంభాషించారు. అయితే బాలకృష్ణ ప్రెస్ మీట్ ఫై ఇటీవల రోజా స్పందించింది సంచలన వ్యాఖ్యలు చేసింది. రోజా మాట్లాడుతూ…..బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు వెన్నుపోటుదారుడు ఆ సీట్లో కూర్చుంటే ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అంటున్నారు. అది నేను చెప్పిన మాట కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు బాలకృష్ణ కోర్టు సమర్పించిన తన ఆఫెడ బిక్ తో తానే నేను మానసిక రోగినని ఈ దేశంలో ఉన్న నాలుగు మెంటల్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నానని సెల్ఫ్ సర్టిఫైడ్ సైకోగా ఆయన ఆఫెడ్ బిక్ ఇచ్చారని గుర్తు చేశారు.
అలాంటి మెంటల్ స్టేటస్ ఉన్న బాలకృష్ణ గారు తెలుగువారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతాను అంటే ఆ తెలుగుదేశం పార్టీ వారు అందరూ మా పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నట్లుగా రోజా పేర్కొంది. అలాగే ఈరోజు బాలకృష్ణ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. తెలుగు వాడి కోసం పోరాడుతాను తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తాను , అంటున్నావ్ కదా…ఇవాళ దొంగ సాక్షదారాలతో దొరికిన మీ బావ కోసం నువ్వు పోరాడితే తెలుగువారి కోసం ,తెలుగు వారి పౌరుషం కోసం కాపాడినట్లు కాదు అన్నారు. నీ తండ్రి ఎన్టీ రామారావు తెలుగోడి పవర్ ఏంటో ఢిల్లీకి చూపించే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారికి అండగా ఉంటే..ఆయన దగ్గర నుండి పార్టీ లాక్కొని హోటల్లో ఆయన పై చెప్పులు వేసి, అసెంబ్లీలో ఆయన దగ్గర మైక్ లాక్కుని ఆయనను కంటతడి పెట్టేలా చేసిన చంద్రబాబు మీద నువ్వు పోరాటం చేసి ఉంటే తెలుగు వారంతా సంతోషించేవారు అన్నారు.
హైదరాబాదులో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్ల ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలేసి చంద్రబాబుతో పాటు దొంగలాగా కరకట్టకు పారిపోకుండా ధైర్యంగా నువ్వు నిలబడి పోరాడి ఉంటే తెలుగువారి పౌరుషం తెలుగు వారి సత్తా ఏంటో అందరూ అర్థం చేసుకునే వాళ్లు అని రోజా అన్నారు. అలాగే ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని మీ బావ చంద్రబాబు నాయుడు మీ అల్లుడు లోకేష్ ఏ విధంగా కడుపునిండా తిన్నా రో, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో అప్పుడు నువ్వు నిలబడి పోరాడి ఉంటే నిజంగా తెలుగువారి కోసం పోరాడిన వాడిలా అందరూ అనుకునేవారని రోజా చెప్పుకొచ్చింది. ఇక ఈరోజు మీరు చేస్తున్న పోరాటం ఒక దొంగను కాపాడడానికి ఒక గజ దొంగను కాపాడడానికని రోజా పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు లేపుతున్నాయి.