Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఎక్కించే ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి29 రోజుకో అప్డేట్ తో ఫ్యాన్సు పండగ చేసుకుంటున్నారు. కాగా మహేష్ మరియు జక్కన్న కాంబినేషన్లో మూవీకి గాను ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. దర్శకేంద్రుడు రాజమౌళి ప్రతి సినిమాను తన గతంలో చేసిన సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్ లో తీస్తాడు కాబట్టి ఈ సినిమా కూడా వేరే లెవల్లో ఉండబోతుందని పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తవుతుందా ఎప్పుడప్పుడు సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.
ఈ సినిమా మొదటి నుంచే రాజమౌళి మరియు మహేష్ బాబు చాలా కేర్ తీసుకుంటూ అన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి హాలీవుడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో రాజమౌళి చేతులు కలిపిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటింపజేసేందుకు ఆ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే హాలీవుడ్ మూవీ థోర్ సినిమాలో చేసిన హాలీవుడ్ యాక్టర్ “క్రిస్ హెమ్స్ వర్త్” మహేష్ రాజమౌళి సినిమాలలో గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావడానికి ఇంకా కొద్దిరోజులు టైం పడుతుంది.
Rajamouli : జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా…
జేమ్స్ బాండ్ మరియు ఇండియానా జోన్స్ వంటి చిత్రాల తరహాలోనే యాక్షన్ త్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించడానికి రాజమౌళి ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ గా గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి అంటూ టొరెంట్ ఫిలిం ఫెస్టివల్ లో దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ రాజమౌళి వెళుతున్నాడు. కాగా ఈ వార్త తో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోను లేకుంటే సమ్మర్ తర్వాతను షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని సినిమా యూనిట్ వారు తెలియజేశారు