ఒడిశా రైలు ప్రమాదంపై కామెడీ వీడియో షేర్ చేసిన నటుడు రాహుల్ .. ఏకిపారేసిన నెటిజన్స్ ..

rahul-ramakrishna-sensational-comments-on-odisha-train-accident
rahul-ramakrishna-sensational-comments-on-odisha-train-accident

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడు రాహుల్. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో అతడికి ఫ్రెండ్ గా నటించి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో పాపులర్ అయిన రాహుల్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెటిజన్స్ కి ఆగ్రహం కలిగించింది. మనకు తెలిసిందే ఒడిస్సాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 250 మంది మరణించారు. 900 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

ఈ దుర్ఘటనపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే రాహుల్ రామకృష్ణ ఒడిస్సా రైలు ప్రమాదాన్ని కామెడీ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు అసలు మనిషివేనా అంటూ ఫైర్ అయ్యారు. ఇంత సీరియస్ విషయాన్ని కామెడీ చేస్తావా అంటూ కామెంట్స్ చేసారు. హాలీవుడ్ లోని సైలెంట్ సినిమా ట్రైన్ సీన్ ను షేర్ చేసాడు. ఆ వీడియోలో ట్రైన్ ముందు కొంతమంది వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ రాహుల్ పై విమర్శలు కురిపించారు. రైలు ప్రమాదంలో చాలామంది మరణించారు. ఎంతోమందికి కడుపు కోత మిగిల్చింది.

Advertisement

అలాంటి సంఘటనపై కామెడీ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నువ్వు అసలు మనిషివేనా . ఇది కామెడీ చేసే సమయమా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో వెంటనే రాహుల్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. నెటిజన్స్ కు సారీ చెప్పాడు. నేను వేసిన ట్వీట్ కు క్షమాపణ చెబుతున్న ఈ ఘటన గురించి నాకసలు తెలియదు. తప్పు జరిగింది. ఒట్టేసి చెబుతున్న ఇది కావాలని చేసింది కాదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ చేసిన కామెడీ వీడియో వైరల్ గా మారింది. ఎది ఏమైనా ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగడం అందరికి బాధాకర విషయం.

Advertisement