Morning Prayer : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని జపిస్తే ఇక మీకు తిరుగులేదు. ఎలాంటి ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపదు. సానుకూల వాతావరణం ఏర్పడి. శుభ ఫలితాలు కలుగుతాయి.
ఉదయం లేచి తమకు ఈరోజు బాగుండాలని దేవుని ప్రార్థిస్తారు. సానుకూలతను ప్రసరింప చేసే శక్తి ఈ ప్రార్ధనకు ఉంది. ప్రార్ధన అంటే మరేమిటో కాదు. అది కూడా కొన్ని క్షణా లుపాటు మనసుని ఏకగ్రతగా ఉంచి చేసే ఒక ధ్యానం లాంటిది.
మానసిక ప్రశాంతత కలగజేసే ప్రార్థనలు, జపించడానికి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. రోజు మంచి తో ప్రారంభం అయితే ఆ రోజంతా శుభం కలుగుతుందని నమ్ముతారు. నిద్ర లేవగానే మీరు చేసే మొదటి పని రోజంతా మంచిగా లేదా చెడుగా నిర్ణయిస్తుంది. అయితే దేవుని యొక్క అనుగ్రహం కలిగి ఉంటే ఎలాంటి ప్రతికూల ప్రభావం తలెత్తవు. ఇక్కడ కొన్ని మంత్రాలను జపించడం మంచిది. వీటిని పఠించడం ద్వారా రోజు శుభంగా గాడుస్తుంది.
Morning Prayer : ఉదయం నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని పఠిస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి.
కాబట్టి ఉదయం లేవగానే ఏం చేయాలి? ఎలాంటి మంత్రాలను పఠించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి అరిచేతిలో ముక్కోటి దేవతలు ఉంటారని చెబుతున్నారు. అరిచేతికొనల్ లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మధ్యలో సరస్వతి ఉంటుంది. అడుగు భాగంలో గౌరీదేవి నివాస సమయం ఉంటుంది. కాబట్టి మీరు నిద్రలేచిన వెంటనే అరిచేతిని చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి.
ఈ మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే జపించాలి. మంత్రాన్ని పఠించేముందు అరిచేతులను చూస్తూ పఠించాలి.కరాగే వసతు లక్ష్మి, కరామధ్య సరస్వతి, కరములే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనంఆ తరువాత భూదేవి ప్రార్థన చేయాలి. నిద్ర లేవగానే మొదటి అడుగు నేల మీద పెట్టేముందు ఓబు తల్లి మమ్మల్ని క్షమించు అంటూ ఆ తల్లిని తలుచుకొని ప్రార్థన చేయాలి